హనుమకొండ చౌరస్తా, మే 4 : వరంగల్ నిట్లోని ఉన్నత్ భారత్ అభియాన్(యూబీఏ) సంస్థలోని అన్ని విభాగాలు ముందుకొచ్చి గ్రామీణ ప్రాం తాలకు నైపుణ్యాన్ని అందించాలని, దీంతో దేశాభివృద్ధిలో యూబీఏ కీలకపాత్ర పోషిస్తుందని నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అన్నారు. వరంగల్ నిట్లోని ఉన్నత్ భారత్ అభియాన్(యూబీఏ) విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ల(పీఐ) కోసం ఓరియంటేషన్ వర్షాప్ను హోమీబాబా హాల్, సెమినార్ హాల్స్ కాంప్లెక్స్లో గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి, రిజిస్ట్రార్ ఎస్ గోవర్ధన్రావు, యూబీఏ నేషనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వీరేందర్కుమార్ విజయ్(ఆన్లైన్), యూబీఏ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ జీ సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి తోడ్పడేలా ప్రొఫెసర్లు, పరిశోధకులు ఆలోచించాలని కోరారు. ఎన్ఐటీ వరంగల్ లోని పాఠ్యాంశాల్లో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన కోర్సులను కూడా చేర్చనున్నట్లు ఆయన చెప్పారు. యుబీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు.
వర్షాప్లో వివిధ సంస్థల నుంచి 26 మంది కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. రాబోయే మూడురోజుల్లో 12 సెషన్లు, యాక్టివిటీస్, ఫీల్డ్ విజిట్లు ఉంటాయన్నారు. వర్షాప్ ప్రతి పీఐతో సంభాషించడంతోపాటు తెలంగాణలో శక్తివంతమైన గ్రామాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. యూబీఏ ప్రాంతీయ కోఆర్డినేటర్ డాక్టర్ జీ సునీత మాట్లాడుతూ వరంగల్ నిట్ యూబీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. ప్రాంతీయ కేంద్రం ఐదు భాగస్వామ్య సంస్థలతో ప్రారంభించగా నేడు 26కి పెరిగాయన్నారు. వీటితో తెలంగాణ ప్రాంతంలోని 130 గ్రామాలతో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. యూబీఏ నేషనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వీరేందర్కుమార్ విజయ్ మాట్లాడుతూ 2014లో 2000 గ్రామాలతో పని చేయడం ద్వారా యూబీఏ ప్రారంభించిందని, నేడు 17,500 గ్రామాలతో పనిచేస్తున్నదన్నారు. 2047 నాటికి దేశంలోని అన్ని గ్రామాలను కవర్ చేయడం, కమ్యూనిటీ డెవలప్మెంట్, ఇన్నోవేషన్లో వారికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన్రావు మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిపై అనేక సంస్థలు క్రెడిట్ ఆధారిత కోర్సులను ఆఫర్ చేస్తున్నాయని, ఇందులో ఇంటర్న్షిప్ను కొనసాగించేందుకు ప్రోత్సహిస్తున్నాయని వివరించారు. 17,500 గ్రామాలకు యూబీఏ చేరువకావడం అభినందనయమన్నారు. మౌలిక వసతులు అవసరమయ్యే 50 గ్రామాలకు వరంగల్ నిట్ చేరువ కావాలని, ఆ గ్రామాల అభ్యున్నతికి మనం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన సమస్యల పరిషారంపై పరిశోధనలు చేయాల్సిన అవసరముందన్నారు. మన పరిశోధకులను గ్రామీణ ప్రాంతాలను సందర్శించి సమస్యలను అర్థం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.
విద్యా, పాఠ్యేతర కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన వరంగల్లోని నిట్ విద్యార్థులకు ఎండోమెంట్ అవార్డులను గురువారం అందజేశారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 29 బంగారు పతకాలు, 16 నగదు పురసారాలను నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అందజేశారు. అవార్డులకు పూర్వవిద్యార్థులు, ఇన్స్టిట్యూట్లోని ఇతర వాటాదారుల సహకారం అందిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రత్నాల స్పందన రెండు బంగారు పతకాలు, మూడు నగదు బహుమతులు గెలుచుకుంది. సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అల్లె మధురిత రెండు బంగారు పతకాలు, నగదు బహుమతిని అందుకుంది. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ ఎన్వీ ఉమామహేశ్, రిజిస్ట్రార్ ఎస్ గోవర్ధన్రావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.