వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 30 : కేఎంసీలోని సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు ఏర్పాట్లు చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ రమేశ్రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సందర్శించారు. ఓపెన్ హార్ట్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని అభినందించారు. శస్త్రచికిత్స అనంతరం ఐసీయూలో వైద్య సేవలు పొందుతున్న వడ్డేపల్లి స్వప్నను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వైద్యాధికారులతో మాట్లాడి ప్రస్తుతం రోగి పరిస్థితిపైచ ఆరా తీశారు. త్వరలోనే అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయడానికి వైద్యులు సిద్ధం కావాలని అన్నారు. అనంతరం హాస్పిటల్ సేవలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. మరిన్ని సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్రావు, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ మమతారెడ్డి, సీటీ సర్జన్లు డాక్టర్ అల్లాడి సృజన్, డాక్టర్ బత్తిని రిషిత్, న్యూరో సర్జన్ డాక్టర్ నర్సింగరావు, ఆర్ఎంవోలు డాక్టర్ హీనా, డాక్టర్ శ్రీనివాస్, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.