నయీంనగర్, మార్చి 17 : నిట్ వరంగల్లో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న టీ మణిసందీప్రెడ్డి గేట్-2022లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు.. మణిసందీప్రెడ్డికి పూలమొక్క అందజేసి అభినందనలు తెలిపారు. మణిసందీప్రెడ్డి స్వస్థలం హైదరాబాద్లోని బోడప్పల్. ఆయన తండ్రి రాంగోపాల్రెడ్డి ప్రైవేట్ ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. తల్లి ఐశ్యర్య గృహిణి. మణిసందీప్ ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా ప్రొఫెసర్ల సాయంతో చదువుకుని జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సంపాదించాడు. గత సంవత్సరం గేట్లో 299వ ర్యాంకు వచ్చింది.