జనగామ రూరల్, డిసెంబర్18: పేదలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, సంపాదించుకోవడానికి రాలేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండలం లోని వడ్లకొండ గ్రామంలో మండల ముఖ్య కార్య కర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేశారన్నారు. 130గ్రామాలకు 120 గ్రామాల్లో తనకు స్పష్టమై న మెజార్టీ వచ్చిందన్నారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటానన్నారు. తన ఎమ్మెల్యే జీతం పేద ప్రజల అవసరాలకు ఉప యోగిస్తానన్నారు. ఇక్కడే ఇల్లు కట్టుకోవడం తప్ప ఒక్క గుంట భూమి కొననని, ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనని తెలిపారు. ప్రతి పేద వాడికి పైసా ఖర్చు లేకుండా వైద్యం అందిస్తానని, ఇప్పటికే రూ. 60 లక్షల విలువ చేసే వైద్యం అం దించానని, ప్రస్తుతం 30 మంది నీలిమ దవా ఖానలో వైద్యం పొందుతున్నారని తెలిపారు.
గవ ర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్ప నలతో ఉన్నదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సృష్టించి న ఆస్తుల వివరాలను చెప్పకుండా, కేవలం అప్పు ల గురించే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం సరికాద న్నారు. ఆ సాకుతో ఆరు గ్యారెంటీల అమలును అటకెక్కించాలని చూస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి భాష ఎంత దుర్మార్గంగా ఉందో ప్రజలు గుర్తించాలన్నారు. తన మీద కూడా సోషల్ మీడియాలో అసత్యాలు ట్రోల్ చేస్తున్నారని, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని, రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ తోనే ఉంటానన్నారు.