తాడ్వాయి, అక్టోబర్26 : వచ్చే ఏడాది 2025లో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర (మండె మెలిగే పండగ) తేదీలను శనివారం అమ్మవా ర్ల పూజారులు ఖరారు చేశారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మ క్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల పూజారులు అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో శనివారం స మావేశం నిర్వహించారు.
ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం మినీ జాతర తేదీలపై పెద్దలతో కలిసి చర్చించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు నాలుగు రోజలు పాటు జాతరను నిర్వహించేందుకు నిర్ణయించారు. మినీ జాతరను పురస్కరించుకొని అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం మిన హా మహాజాతరలో నిర్వహించినట్లుగానే పూజాకార్యక్రమాలు ఉంటాయన్నారు. పూజారులు కొక్కెర కృష్ణయ్య, భోజారావు, కాక సారయ్య, కిరణ్, రమేశ్, అరుణ్కుమార్, అమృతమ్మ పాల్గొన్నారు.