నర్సంపేట, ఏప్రిల్ 14 : ఎండలు మండిపోతున్నాయి. జనం మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎక్కువ మంది ఉదయం, సాయంత్రం వేళల్లోనే పనులు చూసుకుంటున్నారు. కార్లలో ఏసీ ఉన్నందున ఎప్పుడైనా వెళ్తారు. కానీ సామాన్యులు మధ్యాహ్నం వేళల్లో ఆటోల్లో వెళ్లడం లేదు. దీంతో ఆటోడ్రైవర్లకు గిరాకీ తగ్గింది.
ఈ క్రమంలో ఓ ఆటోడ్రైవర్ వినూత్న ఆలోచన చేశాడు. ఆటోకు టాప్లో గడ్డి గులాబీ, ఇతర మొక్కలను ఏర్పాటు చేశాడు. అవి ఎండిపోకుండా పైన షేడ్ నెట్ కట్టాడు. ఆటోపై ఎండ ప్రభావం లేకుండా గ్రీన్ ఆటో తయారు చేసుకున్నాడు. ఈ ఆటోను మహబూబాబాద్ జిల్లాకు భూక్యా అంజి రోడ్లపై తిప్పుతున్నాడు. నర్సంపేట రోడ్లపై ఈ లో ప్రయాణికులను తీసుకువెళ్తున్నాడు.