ఐనవోలు : ఐనవోలు మల్లికార్జునస్వామి హుండీని మంగళవారం లెక్కించా రు. 38 రోజులకు గాను 18 హుండీలను తెరిచి లెక్కించగా, రూ.39,82,104 వచ్చింది. టిక్కెట్ల ద్వారా రూ.1,14,19,568 సమకూరింది. హుండీ, టికెట్ల ద్వారా మొత్తం ఆదాయం రూ.1, 54,01,672 వచ్చిందని ఈవో అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు. గత జాతర కన్నా రూ.6,71,200 అధిక ఆదాయం వచ్చింది. పరిశీలకులు ఎండోమెంట్కు చెందిన జీ సంజీవరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ బొల్లు రమేశ్, కానిస్టేబుళ్లు నాగరాజు, శ్రీనివాస్, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి మహబూబాబాద్, అర్చకులు, సిబ్బంది కిరణ్, మధుకర్, శ్రీకాంత్, కన్నయ్య, రాజు పాల్గొన్నారు.