హనుమకొండ, ఏప్రిల్ 11 : పూలే గొప్ప అభ్యుదయ వాది, సామాజిక విప్లవ పితామహుడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ అన్నారు. గురువారం బాలసముద్రంలో ని పార్టీ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్ అధ్యక్షత నిర్వహించిన వేడుకలకు దాస్యం హాజరై ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫూలే స్ఫూర్తితో బహుజన వర్గాల అభ్యున్నతికి పోరాడుదామని పిలుపునిచ్చారు. సామాజిక దురాచారాలపై పోరాడిన విప్లవయోధుడు ఫూలే అన్నారు. ఫూలే జయం తి, వర్ధంతిని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అధికారికంగా నిర్వహించారని, ఆయన పేరిట వందలాది గురుకుల పాఠశాలలను ప్రారంభించారని వివరించారు. కుడా మాజీ చైర్మన్లు సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్లు జోరిక రమేశ్, కుసుమ లక్ష్మీనారాయణ, మేకల బాబురావు, వేణు, కే శ్రవణ్, డివిజన్ అధ్యక్షులు సదాంత్, మనోజ్, చందర్, చిన్న పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా : గొప్ప దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని కేయూ వీసీ తాటికొండ రమేశ్ అన్నారు. దూరవిద్య కేంద్రంలోని ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. రిజిస్ట్రార్ మల్లారెడ్డి పాల్గొన్నారు.
వరంగల్ : మహిళోద్ధరణ కోసం కృషి చేసిన సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొనియాడారు. ములుగు రోడ్ జంక్షన్లోని ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
నర్సంపేట/కరీమాబాద్/పర్వతగిరి/హసన్పర్తి/చెన్నారావుపేట: వరంగల్ జిల్లావ్యాప్తంగా గురువారం జ్యోతిరావు ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. నర్సంపేటలో ఫూలే చిత్రపటానికి టీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. టీ ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైసి శోభన్బాబు, రాష్ట్ర నాయకులు ఆరెపల్లి బాబు, కొడారి రవి, శ్రీనివాస్, ప్రభాకర్, కృష్ణ, బాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే, వరంగల్ ఉర్సు దర్గా సమీపంలోని ఫూలే విగ్రహానికి కందిమల్ల మహేశ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా ఫూలే విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి నిర్వహించారు. పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండలో హితకారిణి సేవా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు గటిక మల్లయ్య ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హసన్పర్తి మండలం గ్రేటర్ ఒకటో డివిజన్ పరిధిలోని ముచ్చర్లలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చెన్నారావుపేటలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నమిండ్ల వెంకట్ జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐనవోలులో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడు అమరవాది రవి, మాజీ ఎంపీటీసీ బొల్లెపల్లి మధుతో కలిసి నాయకులు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.