కాశీబుగ్గ/ఖిలావరంగల్/వరంగల్ చౌరస్తా/ కరీమాబాద్/ఖానాపురం/గీసుగొండ/సంగెం, మార్చి 1 : మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం జిల్లాలోని శివాలయాల్లో పలువురు ప్రజాప్రతినిధులు పూజలు చేశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి, భక్తమార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. ఆలయం పక్కనున్న స్థలంలో కల్యాణ మండపాన్ని నిర్మించుకోవాలని, ఆలయ అభివృద్ధికి సీడీఎఫ్ నుంచి రూ.2కోట్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. చిన్నవడ్డేపల్లి చెరువుకట్టను ట్యాంక్బండ్గా అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, ఓని భాస్కర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే నన్నపునేని కోటలోని శంభులింగేశ్వరస్వామి ఆలయం, కరీమాబాద్లోని బొమ్మలగుడి, గిర్మాజీపేటలోని శివాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నూతన కమిటీలను ఎమ్మెల్యే ప్రకటించి, ప్రమాణ స్వీకారం చేయించారు. శంభులింగేశ్వర ఆలయంలో 37, 38వ డివిజన్ల కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్యాదవ్, ఆలయ అర్చకుడు శీలమంతుల శంభులింగం, బొమ్మలగుడి ప్రధాన అర్చకుడు శివపురం రామలింగ ఆరాధ్య, కుడా సలహా మండలి సభ్యుడు మోడెం ప్రవీణ్, కార్పొరేటర్లు సిద్దం రాజు, మరుపల్ల రవి, పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, గిర్మాజీపేటలో మాజీ కార్పొరేటర్ జారతి రమేష్ పాల్గొన్నారు. శివనగర్లోని ప్రజాపిత బ్రహ్మకుమారి భవన్లో జరిగిన శివరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే నరేందర్ పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఖానాపురం మండలం కొత్తూరు దుర్గామల్లేశ్వరస్వామి, బాలుతండాలోని త్రికూట ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి సీసీ రోడ్డు నిర్మించేందుకు సీడీఎఫ్ నుంచి రూ.5లక్షలు మంజూరు చేస్త్తున్నట్లు తెలిపారు. ఓడీసీఎంఎస్ చైర్మన్ దంపతులు గుగులోత్ రామస్వామినాయక్, శాంతి, ఎంపీపీ దంపతులు వేములపల్లి ప్రకాశ్రావు, పద్మ, జడ్పీటీసీ దంపతులు బత్తిని స్వప్నా శ్రీనివాస్గౌడ్, సర్పంచ్ దంపతులు బూస రమా అశోక్, వెన్ను శ్రుతీ పూర్ణచందర్ పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జ్యోతి దంపతులు గీసుకొండ మండలం ఊకల్ గ్రామంలోని సుబ్రహ్మణేశ్వర ఆలయం, సంగెం మండల కేంద్రంలోని సంగమేశ్వరాలయం, కుంటపల్లిలోని రామలింగేశ్వరాలయం, చింతలపల్లిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఘనంగా సన్మానించారు. గీసుకొండలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సర్పంచ్ మొగసాని నాగమణి, ఎంపీటీసీ బేతినేని వీరరావు, పార్టీ మండల అధ్యక్షుడు వీరగోని రాజుకుమార్, సొసైటీ చైర్మన్ వీరస్వామి పాల్గొన్నారు. సంగెంలో వరంగల్ జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు దంపతులు, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, నరహరి, సర్పంచ్ బాబు, ఎంపీటీసీలు మల్లయ్య, బొమ్మ పావని, కుంటపల్లి సర్పంచ్ కావటి వెంకటయ్య, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, దేవాలయ ప్రధాన అర్చకుడు అప్పె నాగార్జునశర్మ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసునూని సారంగపాణి పాల్గొన్నారు. నగరంలో 3వ డివిజన్ పైడిపల్లిలోని చంద్రమౌళీశ్వరస్వామి దేవాలయంలో శివలింగానికి రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితా కుమార్యాదవ్ పూజలు చేశారు.