వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 4: కాకతీయ మెడికల్ కళాశాలలో నిర్వహిస్తున్న ఉత్కర్ష వేడుకల్లో భాగంగా ఆదివారం 5కే హెల్త్ రన్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
రోజూ వ్యాయామం, నడక, యోగా వంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. ర్యాలీ హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద వైద్య విద్యార్థులు ప్రజలకు ఆరోగ్య సూత్రాలను వివరిస్తూ ప్లాష్మాబ్ నిర్వహించారు. ఒకే రంగు దుస్తులు ధరించిన వైద్య విద్యార్థులు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్రెడ్డి, వైద్యులు రాజు, అన్వర్, మాధవి, లక్ష్మీనారాయణ, సురేందర్, కవిత పాల్గొన్నారు.