వరంగల్ : ఖిలా వరంగల్ను టూరిజం హబ్గా చేశామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. ఖిలా వరంగల్ తూర్పు కోటలోని హనుమాన్ సెంటర్లో రూ.3 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నన్నపునేని శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ..గత మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారాయి. ఇక్కడ కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహించిన బిల్లా శ్రీకాంత్ రిజర్వేషన్ మారటం వల్ల అవకాశం కోల్పోయారు. బిల్ల శ్రీకాంత్కు కో ఆఫ్షన్ సభ్యుడిగా అవకాశం ఇవ్వనున్నట్లు సభావేదికగా ఎమ్మెల్యే ప్రకటించారు. రానున్న రోజుల్లో ఖిలా వరంగల్ను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు.