నమస్తే తెలంగాణ నెట్వర్క్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్లు కట్ చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే, బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు రక్తదానం చేశారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం లో మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ కేక్ కట్ చేశారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కుడా మాజీ చైర్మన్లు సుందర్రాజ్ యాదవ్, మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు. అలాగే, ఖిలావరంగల్లోని 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని కేక్ కట్ చేశారు.
కాశీబుగ్గ 18వ డివిజన్లో కూడా కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. హసన్పర్తి మండలం భీమారంలో కార్పొరేటర్ జక్కుల రజితా వెంకటేశ్వర్లు ఆధ్యర్యంలో జరిగిన కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. నర్సంపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కేక్ కట్ చేసి, కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నల్లబెల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న కేక్ కట్ చేశారు. అలాగే, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ హనుమకొండ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భారత జాగృతి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి మడిపల్లి సుశీల్గౌడ్తోపాటు సహస్ర ఫౌండేషన్ సంస్థ తరఫున వరంగల్లోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా చిన్నారులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడిశాల సమ్మయ్యగౌడ్ ఆధ్వర్యంలో, భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో జరిగిన కార్యక్రమాల్లో హనుమకొండ జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.