లింగాలఘనపురం, నవంబర్ 14 : బ్రహ్మోత్సవాల్లో భాగంగా జీడికల్ రామచంద్రస్వామి ఆలయంలో సోమవారం తిరుకల్యాణం వైభవంగా జరిగింది. పునర్వసుయుక్త కర్కాటక లగ్న సుముహూర్తాన సీతారామ, లక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను పల్లకీల్లో వేదికపైకి తీసుకురాగా, బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛారణల నడుమ పెళ్లి వేడుక ఘనంగా సాగింది. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని స్వామివారికి పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించగా, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం ఈ అపూర్వ ఘట్టాన్ని కనులారా వీక్షించి తరించింది. కల్యాణం సందర్భంగా ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలు, బోనాలతో ఆలయ ప్రాంగణమంతా సందడిగా మారింది.
మరో భద్రాద్రిగా పేరుగాంచిన జీడికల్ రామాలయంలో తిరు కల్యాణం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉమ్మడి వరంగల్తో పాటు హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్ తదితర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకను తిలకించారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పాల్గొని వారికి స్వామివారికి పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆలయంలోని సీతారామ, లక్ష్మణ ఉత్సవ విగ్రహాలను రెండు పల్లకీల్లోకి చేర్చి, ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన కల్యాణ వేదికపైకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే రాజయ్య, జడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి, కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, వైస్ ఎంపీపీ కొండబోయిన కిరణ్కుమార్, రెనోవేషన్ కమిటీ అధ్యక్షుడు సానికె మధు, ఈవో శేషుభారతి, లింగాల సింధు పూజా సామగ్రిని తలపై మోస్తూ కల్యాణ వేదికపైకి తీసుకొచ్చారు.
పునర్వసుయుక్త కర్కాటక లగ్న సముహూర్తాన స్వామి వారికి వేద బ్రాహ్మణులు మంత్రోచ్ఛారణలతో తిరుకల్యాణం జరిపించారు. కల్యాణంలో రూ, 2016 చెల్లించి 47జంటలు, శాశ్వత చందాదారులుగా ఉన్న మరో 28 జంటలు పాల్గొన్నాయి. జనగామ, ఆలేరు నుంచి జాతరను పురస్కరించుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. లింగాలఘనపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేసి జాతరకు వచ్చే భక్తులకు వైద్యసేవలను అందించింది. పూజారులు విజయసారథి, శ్రీనివాసాచార్యులు, భార్గవాచార్యులు, మురళీధరాచార్యులు కల్యాణతంతు జరిపించగా, కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్గౌడ్, ధర్మసాగర్ ఎంపీపీ కవిత, నాయకులు బొల్లంపెల్లి నాగేందర్, బోయిని రాజు, దూసరి గణపతి, బుషిగంపల ఆంజనేయులు, ఉపేందర్, కత్తుల శ్రీపాల్రెడ్డి, బూడిద జయరాజేశ్వర్గౌడ్, ఉడుగుల భాగ్యలక్ష్మి, దుంబాల భాస్కర్రెడ్డి, గోగుల సురేందర్రెడ్డి, శ్రీధర్బాబు, రెనోవేషన్ సభ్యులు కారంపురి శ్రీనివాస్, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి, రాజశేఖర్, శ్రీశైలం, కొత్తకొండ గోవర్ధన్, ఐలయ్య, ఆలయ సిబ్బంది కేకే రాములు, కుర్రెముల మోహన్, భరత్కుమార్, మల్లేశం, ఆర్ఐలు నెల్లుట్ల శ్రీనివాస్రివు, వెంకటేశ్వర్లు ఏసీపీ రఘుచందర్, ఎస్సైలు ప్రవీణ్, రఘుపతి, ఏఎస్సై అమరేందర్రెడ్డి శాంతిభద్రతలను పర్యవేక్షించారు.