జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని చిట్యాల మండలం నవాబుపేట గ్రామ శివారు, మొగుళ్లపల్లి మండలం పోతుగల్ గ్రామాల మధ్య రూ. 5.09 కోట్ల విలువగల చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం నవాబుపేట గ్రామంలో రూ.15 లక్షల విలువగల సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలకు మహర్దశ పట్టిందన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు, యార సుజాత, దావు వినోద, జడ్పీటీసీలు జోరుక సదయ్య, గొర్రె సాగర్, పీఏసీఎస్ చైర్మన్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.