జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణలోని సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. రాష్ట్రం ఏర్పాటైన అనతికాలంలోనే రాష్ట్ర అభివృద్ధి చెందడంలో సీఎం కేసీఆర్ చేసిన కృషి మరువలేనిదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. జిల్లా లోని టేకుమట్ల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక రైతు వేదికలో కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. అలాగే జీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లా రెడ్డి, జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.