బచ్చన్నపేట, జూన్ 9 : జనగామ జిల్లాలోని 281 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు జరుగుతున్నా యి. జిల్లా వ్యాప్తంగా 1,31,298 జాబ్కార్డులుండగా 2,88,995 మంది కూలీల పేర్లు నమోదు అయ్యా యి. ప్రస్తుతం 85,263మంది ఉపాధి పొందుతున్నారు. వీరికి 15,61,538 లక్షల పని దినాలు కల్పించారు. పనికి వస్తున్న కూలీల హాజరు ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్) యాప్ ద్వారా ప్రతీ రోజు నమోదు చేస్తున్నారు. గతంలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలు చోటు చేసుకోకుండా ఈ విధానం ఎంతో దోహదపడుతుంది. పనికి వచ్చిన వారి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తుండడంతో అక్రమాలకు ఆస్కారం ఉండదు.
జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఫిష్పాండ్లు, ఫాంపాం డ్లు, పొలాల వద్దకు మట్టిరోడ్లు, చెరువుల్లో పూడికతీత, పొలాలను లెవలింగ్ చేయడం వంటి పనులు చేయిస్తున్నారు. గతంలో పనికి వచ్చిన కూలీల పేర్లు రాసేవారు. పనికి రాని వారి పేర్లు సైతం మస్టర్లలో రాయడంతో పనికి వచ్చిన కూలీలకు అన్యాయం జరిగేది. మస్టర్ల నిర్వహణ అస్తవ్యస్తంగా కొనసాగేది. ప్రతీ గ్రా మంలో, మండలంలో నిర్వహించే సామాజిక తనిఖీల్లో అవకతవకలు బయటపడి గ్రామాల్లో రసాభాస జరిగేది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మస్టర్ల నిర్వహణ అంతా ఆన్లైన్లో పొందుపర్చింది. కూలీల నుంచి డి మాండ్ తీసుకుని ఆన్లైన్లో మస్టర్లు ప్రింట్ తీసి పేర్లు వచ్చిన వారు మాత్రమే కూలీకి వెళ్లే విధంగా మార్పు తీసుకురావడంతో కూలీల్లో సైతం హర్షం వ్యక్తమవుతోంది. ఏ రోజు నుంచి ఏరోజు వరకు పనికి వెళ్లాలో, పని ప్రదేశం సహా అందులో పొందుపర్చడంతో ఉపా ధి పనులు పారదర్శకంగా జరుగుతున్నాయి.
ఎన్ఎంఎంఎస్ విధానంతో పక్కాగా..
ఉపాధి హామీ ద్వారా అర్హులైన కూలీలు మాత్రమే ఉపాధి పొందేలా ప్రభుత్వాలు ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టమ్) విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలులోకి రావడంతో ఉపాధిలో మరింత పారదర్శకంగా పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం గ్రామానికి ఒక సీనీయర్ మేట్ను ఎంపిక చేసి మొబైల్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేయించి పంచాయతీ కార్యదర్శులు ప్రతీ రోజు పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. పని జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి మస్టర్లలో ఉన్న పేర్లను చదివి హాజరు, గైర్హాజరు వేయడం, తర్వాత పని జరుగుతున్న ఫొటోను మొబైల్లో పొందుర్చుతున్నారు. దీంతో పనికి వచ్చిన వారికే కూలీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
అక్రమాలకు అడ్డుకట్ట
ఉపాధి పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడుతోంది. ఎన్ఎంఎంఎస్ విధానంతో కూలీలకు న్యా యం జరుగుతుంది. పనులకు వచ్చిన వా రికి మా త్రమే కూలీ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ పని జరుగుతుందో జియోట్యాగింగ్ ద్వారా తెలిసిపోతుంది. అక్రమాలు, అవినీతికి ఇక చెల్లు. పనుల్లో పూర్తి పారదర్శకత ఉంటుంది. జాబ్కా ర్డు ఉన్న అందరికీ పని కల్పిస్తాం. ఎప్పటికప్పుడు మం డల స్థాయి నుంచి జిల్లా అధికారి వరకు పర్యవేక్షిస్తున్నాం.
– గూడూరు రాంరెడ్డి, డీఆర్డీవో