డీసీపీ శ్రీనివాస్రెడ్డి
జనగామ చౌరస్తా, జూన్ 11 : బాలలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జనగామ డీసీపీ బీ శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. శనివారం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డీసీపీ శ్రీనివాస్రెడ్డి జిల్లా బాలకార్మికుల పరిరక్షణ విభాగం అధికారులతో కలిసి శుక్రవారం ఆయన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ బాలలను పనుల్లోకి తీసుకుంటే చట్టం శిక్షిస్తుందన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి రవికాంత్ మాట్లాడుతూ ఎక్కడైనా పిల్లలను పనిలో పెట్టుకుంటే 1098 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉన్నందున తల్లిదండ్రులు పిల్లలను పనుల్లోకి పంపించొద్దని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చాణక్య, సీడబ్ల్యూసీ చైర్మన్ ఉప్పలయ్య, సభ్యులు కవిత, శ్రీలత, సీఐలు, ఎస్సైలు, ఐసీపీఎస్ సిబ్బంది రంజిత్, ప్రణయ్, చైల్డ్ లైన్ సిబ్బంది ప్రశాంత్, రఘు పాల్గొన్నారు.