పీహెచ్సీలో కరోనా నిర్ధారణ పరీక్షలు
బాధితులకు మెడికల్ కిట్ల పంపిణీ
నర్సంపేట, జూన్ 7: కరోనా నియంత్రణలో భాగంగా సర్కారు ఆదేశాల మేరకు ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్సీల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. సోమవారం నర్సంపేట ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గోపాల్ వ్యాక్సినేషన్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ టీకాలపై అపోహలను తొలగించుకోవాలని ప్రజలకు సూచించారు. 45 ఏళ్లు నిండిన వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. టీకాలతోనే వైరస్కు అడ్డుకట్ట పడుతుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. కరోనా లక్షణాలుంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా 55 మందికి కరోనా పరీక్షలు చేయగా వీరిలో 20 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. బాధితులకు మందులిచ్చి హోంఐసొలేషన్కు పంపామన్నారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట : మండలంలో కరోనా కేసులు పెరుగు తున్నందున ప్రజలందరూ మాస్క్ ధరించాలని, కొవిడ్ నిబం ధనలను పాటించాలని వైద్యాధికారి ఉషారాణి అన్నారు. సోమవారం స్థానిక పీహెచ్సీలో 56 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. బాధితులకు మందులు అందజేశామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్వో వెంకటేశ్వరరావు, స్టాఫ్ నర్సు స్వరూపారాణి, హెల్త్ అసిస్టెంట్ వెంకట్రెడ్డి, కుండె శివాజీ, పాల్గొన్నారు.
ఆత్మకూరులో..
ఆత్మకూరు : మండల కేంద్రంలోని పీహెచ్సీలో సోమవారం 96 మందికి కరోనా పరీక్షలు చేయగా వీరిలో 14 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి రణధీర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలన్నారు. హోం ఐసొలేషన్ సౌకర్యం లేనివారు సెయింట్ థెరిస్సా స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉండాలన్నారు. ఈకార్యక్రమంలో ఫార్మాసిస్టు కవిత, స్టాఫ్ నర్సు ఈశ్వరి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
దామెరలో..
దామెర : మండల కేంద్రంలోని పీహెచ్సీలో సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించచారు. పులుకుర్తి, పసరగొండ, ఊరుగొండ, ల్యాదెళ్ల ్రగ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పీహెచ్సీ డాక్టర్ శిరీష మాట్లాడుతూ కరోనా సోకిన వారికి చికిత్సకోసం మందులతో కూడిన కిట్ అందించామని చెప్పారు. పక్షం రోజులు హోంఐసొలేషన్లో ఉంటే నయమవుతుందన్నారు.
శాయంపేటలో..
శాయంపేట : కరోనాపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని పీహెచ్సీ వైద్యాధికారి నాగశశికాంత్ అన్నారు. స్థానిక పాఠశాలలో సోమవారం 74 మందికి కరోనా పరీక్షలు చేయగా వీరిలో తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. బాధితులకు మెడికల్ కిట్లు అందించి హోంక్వారంటైన్లో ఉండాలని సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి వెంకటేశ్వరవర్మ పాల్గొన్నారు.
సంగెంలో..
సంగెం : మండలంలోని కాట్రపల్లిలో సోమవారం సంగెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో కరోనా వైద్య శిబిరం నిర్వహించారు. 53 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చిందని సర్పంచ్ పులుగు సాగర్రెడ్డి తెలిపారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. సంగెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మందికి 80 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ పీ అశోక్ తెలిపారు.
గీసుగొండలో..
గీసుగొండ : కరోనా టీకా మొదటి డోస్ తీసుకున్న వారు రెండో డోస్ తీసుకోవాలని సర్పంచ్ అల్లం బాలిరెడ్డి అన్నారు. మండలంలోని మరియపురం గ్రామానికి చెందిన 13 మందికి సోమవారం రెండో డోస్ టీకా వేయించినట్లు అయన తెలిపారు. మంగళవారం మరికొందరికి టీకా వేయిస్తామన్నారు. కరోనా నియంత్రణకు అందరూ మాస్కులు ధరించాలని, భౌతి కదూరం పాటించాలని ఆయన ప్రజలను కోరారు.