హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 11 : తెలుగు రాష్రాల్లో అతిపెద్ద వస్త్రవ్యాపార సంస్థ సీఎంఆర్ షాపింగ్ మాల్ ఇప్పుడు హనుమకొండ నయీంనగర్లో అందుబాటులోకి వచ్చింది. సినీతార రాశీఖన్నా, ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాసర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ చెన్నం మధు చేతుల మీదుగా ప్రారంభించారు. మొదటి కొనుగోలు రైస్ మిల్లర్స్ యజమాని, బియ్యం ఎగుమతి వ్యాపారి ఎన్ రామ్మూర్తి చేశారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్భాసర్ మాట్లాడుతూ వస్త్ర ప్రపంచంలో రారాజు సీఎంఆర్ షాపింగ్మాల్ హనుమకొండకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి సంస్థలు రావడం వల్ల నగరం వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. దీని ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయనారు. సీఎంఆర్ ఫౌండర్ అండ్ చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వస్త్ర సౌరభం మన హనుమకొండకు వచ్చిందన్నారు.
అన్ని రకాల వేడుకలకు, అన్ని వర్గాల ప్రజలకు అతి తకువ ధరలకే వస్ర్తాలు అందిస్తున్నట్లు తెలిపారు. సొంతంగా మగ్గాలపై నేయించిన వస్త్రాలు మార్కెట్లో మరెవ్వరూ ఇవ్వని ధరలకు సీఎంఆర్లో లభిస్తాయన్నారు. అనంతరం సీఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ 26వ షోరూం హనుమకొండలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. సీఎంఆర్ అంటే ‘ది వన్ స్టాప్ షాప్’ అంటే ఫ్యామిలీలో అందరికీ నచ్చేలా అన్ని రకాల ైస్టెల్స్, డిజైన్స్ లభిస్తాయన్నారు. తమ వద్ద అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో లభించేలా లక్షల్లో డిజైన్లు, వేలల్లో వెరైటీలు ఉన్నాయన్నారు.
సినీ తార రాశీఖన్నా సందడి
సీఎంఆర్ షాపింగ్మాల్ ప్రారంభోత్సవంలో సినీతార రాశీఖన్నా సందడి చేసింది. షాపింగ్మాల్లోని అన్ని ఫ్లోర్లు కలియ తిరుగుతూ తనదైన శైలిలో ప్రజలు, వినియోగదారులు, అభిమానులను ఆకట్టుకుంది. సినీతార రాశీఖన్నాను చూసేందుకు యువత అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాశీఖన్నా అభిమానులకు అభివాదం చేస్తూ ‘హలో హనుమకొండ’ అంటూ ఉత్తేజాన్ని నింపారు. సీఎంఆర్ షాపింగ్మాల్ను ప్రారంభించిన అనంతరం చీరెలను తిలకించారు. రాశీఖన్నాతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. కాగా, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సీఎంఆర్ షాపింగ్మాల్ ప్రారంభోత్సవంలో నవ్వులు పూయించారు. తన మిమిక్రీతో వివిధ నటుల డైలాగ్స్ను తనదైన శైలిలో మిమిక్రీ చేస్తూ అందరినీ ఆకర్షించారు.