పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి
కలెక్టర్ శశాంక
మహబూబాబాద్, మే 7 : పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని, హాల్టికెట్ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలని కలెక్టర్ కే శశాంక ఇంటర్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల తీరును పరిశీలించి మాట్లాడారు. పరీక్షా కేంద్రంలో జనరల్ విద్యార్థులు 171మందికి 153 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్కు సంబంధించి 295 మందికి గాను 255 మంది పరీక్ష రాసినట్లు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షే శాఖ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలో చెస్ అకాడమిని పరిశీలించారు. కోచ్లు, పిల్లలతో మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 20 మంది పిల్లలను ఎంపిక చేసి ఏప్రిల్ 23 నుంచి మే 8 వరకు 15 రోజుల పాటు చెస్లో శిక్షణ ఇస్తున్నట్లు కోచ్ గోపికృష్ణ తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ నిర్వహించేందుకు అవకాశాలను పరిశీలించాలన్నారు. అనంతరం అక్కడ శిక్షణ పొందుతున్న అంతర్జాతీయంగా ప్రతిభ కనబర్చిన ఇద్దరు చిన్నారులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ రూపాదేవి, సమ్మర్ క్యాంపు చెస్ కోచ్ గోపికష్ణ, జ్యోత్స్న పాల్గొన్నారు.
10లోగా ప్రతిపాదనలు సిద్ధం చేయండి
మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు 10లోగా పూర్తి చేయాలనికలెక్టర కే శశాంక అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి మన ఊరు – మన బడి కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే 10లోగా ప్రతిపాదనలు పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలన్నారు. మండలాల వారీగా ప్రతిపాదనలు ఆమోదించుకుని పనుల గ్రౌండింగ్కు చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, గదులు నిర్మించాలన్నారు. పనులు చేసే ముందు, చేసిన తర్వాత పాఠశాల ఎలా ఉందో తెలిసేలా నాడు, నేడు ఫొటోలు తీయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో అబ్దుల్ హై, జడ్పీసీఈవో రమాదేవి, ప్రత్యేకాధికారులు డీఆర్డీవో సన్యాసయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సింహస్వామి, డీహెచ్ఎస్ సూర్యనారాయణ, పశుసంవర్ధక శాఖ అధికారి సుధాకర్, డిప్యూటీ సీఈవో నర్మద, ఎస్వోలు, ఆర్అండ్బీ ఈఈ తానేశ్వర్ పాల్గొన్నారు.
రెండో రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
మహబూబాబాద్ రూరల్, మే 7 : జిల్లాలో రెండో రోజు శనివారం ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ద్వితీ య సంవత్సరం తెలుగు, హిందీ, సంస్కృతం సబ్జెక్టులకు 18కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,657 మంది విద్యార్థులకు గాను 5,051 (89.3శాతం) మంది పరీక్ష రాశారని, 606 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సత్యనారాయణ తెలిపారు. కాగా, మహబూబాబాద్ పట్టణంలోని సాం ఘిక సంక్షేమ బాలికల పాఠశాల కేంద్రాన్ని కలెక్టర్ శశాంక సందర్శించా రు. ఏర్పాట్లను పరిశీలించారు. వేసవికాలం నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం కల్పించారు. కొవిడ్ నిబంధనలు పాటి స్తూ పరీక్షలు నిర్వహించారు.