జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 9 (నమస్తే తె లంగాణ): సింగరేణి పరిసర గ్రామాల ప్రజల ఆ రోగ్య పరిరక్షణకు సంస్థ ప్రాధాన్యమిస్తున్నట్లు భూ పాలపల్లి జీఎం బళ్లారి శ్రీనివాసరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు గ్రామంలోని కేజీబీవీలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జీఎం శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ పరిసర గ్రామా ల అభివృద్ధి, మౌలిక వసతుల కోసం ఏటా సీఎస్ఆర్ నిధులతో అంతర్గత రోడ్లు, సైడు కాల్వల నిర్మాణం, తాగు నీటి వసతి కల్పన, ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం వృత్తి శిక్షణా కోర్సులు, తదితరాలను సంస్థ నిర్వహిస్తున్నదని తెలిపారు.
వైద్య శిబిరం.. అభినందనీయం
పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమ ని భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు అన్నారు. సింగరేణితో పాటు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పరిసర గ్రామాల్లో మౌలిక వ సతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
వైద్య శిబిరానికి అపూర్వ స్పందన
ఉచిత మెగా వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. కేటీకే ఓసీ-2 ప్ర భావిత గ్రామాలు గడ్డిగానిపల్లి, సెగ్గంపల్లి, ఆకుదారివాడ, కాశీంపల్లి, వేశాలపల్లి, బాలాజీనగర్, పకీరుగడ్డ, కాకతీయ కాలనీ, సుభాష్ కాలనీ, గాంధీనగర్, రాంనగర్, శాంతినగర్ కాలనీ వాసులు హాజర య్యారు. సుమారు 1200 మంది హాజరై, వివిధ పరీక్షలు చేయించు కున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్, భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, వార్డు కౌన్సిలర్లు ఆకుదారి మమత, నాగవెల్లి సరళ, దాట్ల శ్రీనివాస్, మురళీధర్, ఎస్ వోటూ జీఎం వెంకటయ్య, ఈఅండ్ఎం, ఐఈడీ ఏజీఎంలు రామలింగం, జ్యోతి, కేటీకే ఓసీ-2 పీవో వెంకట్రాంరెడ్డి, గని మేనేజర్ భిక్షమయ్య, ఏ రియా దవాఖాన డీవైసీఎంవో పద్మజ, డీజీఎం (సివిల్) కె.సత్యనారాయణ, డీజీఎం (పర్సనల్) అజ్మీరా తుకారాం, పర్సనల్ మేనేజర్ శివకేశవరావు, సీనియర్ పీవోలు శ్యాంప్రసాద్, ప్రశాంత్, క్రాంతికుమార్, టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఇన్చార్జి బడితల సమ్మయ్య, ఏఐటీయూసీ బ్రాంచ్ కమిటీ కార్యదర్శి మోటపలుకుల రమేశ్, సింగరేణి ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ మహ్మద్ ష రీఫ్, స్కౌట్ అండ్ గైడ్స్ పాల్గొన్నారు.