పెద్దవంగర, మార్చి14 : మాజీ మంత్రి నెమరుగొమ్ముల యతిరాజారావు తనయుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్రావు(74) అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. గురువారం ఆయన స్వగ్రామం పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు వెంటరాగా, అశ్రునయనాలతో ఆయనకు వీడ్కోలు పలికారు. 1999లో ప్రజాదీవెన కార్యక్రమంలో టీడీపీలో చేరిన ఆయన చెన్నూరు, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. కుటుంబ సభ్యులు, పాలకుర్తి నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. సుధాకర్రావు తనయుడు వెంకట అనంతరావు అంత్యక్రియలు చేపట్టారు.
సుధాకర్రావు పార్థివదేహాన్ని స్వగ్రామానికి గురువారం ఉదయం 11గంటలకు తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, తొలి శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ కవిత, మాజీ ఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్సీలు రవీందర్రావు, మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్నాయక్, సుదర్శన్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీరాం భద్రయ్య, ధర్మారావు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నవీన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు సుధాకర్రావు పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మాజీ ఎమ్మెల్యే సుధాకర్రావు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు మాజీ మంత్రి దయాకర్రావు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అంతిమయాత్రలో పాల్గొని స్వయంగా పాడెమోశారు. నియోజకవర్గానికి అన్ని విధాలా గుండె ధైర్యంగా ఉన్న గొప్ప శక్తిని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యారు. కార్యక్రమంలో నాయకులు నెహ్రూనాయక్, యాదగిరిరావు, రామచంద్రయ్యశర్మ, సుధీర్కుమార్, సంజయ్, గాంధీనాయక్, ఎంపీపీలు, జడ్పీటీసీ, ఆయా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.