వర్ధన్నపేట మున్సిపాలిటీ 12 వార్డులో రీకౌంటింగ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. తొలుత బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్నిక 7 ఓట్లతో గెలిచినట్లు చెప్పి ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి తిరుపెల్లి వాణి 13 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ప్రకటించడంతో గులాబీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
విషయం తెలుసుకున్న అరూరి రమేశ్ వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రాయపర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు. అదేవిధంగా 5వ వార్డు నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి నూనావత్ షీభారాణిని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అనుచరులు బలవంతంగా తీసుకెళ్లారని పలువురు డీసీ తండాకు చెందిన గిరిజనులు క్యాంపు కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.