చిన్నగూడూరు, జూలై 29 : సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. కురవి మండలం సీరోలు గ్రామానికి చెందిన గౌడసంఘం నాయకులు శుక్రవారం ఉగ్గంపల్లిలో ఎమ్మెల్యే రెడ్యాను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రెడ్యా మాట్లాడుతూ.. సీమాంధ్రుల పాలనలో నిరాధరణకు గురైన కులవృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం ప్రాణం పోసిందన్నారు.
ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపినట్లు తెలిపారు. వేలకోట్ల రూపాయలతో ప్రాజెక్టుల నిర్మించి సాగు, తాగు నీటికి శాశ్వత పరిష్కారం చూసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కురవి మండల అధ్యక్షుడు తోట లాలయ్య, సర్పంచ్ మస్తాన్, గ్రామ అధ్యక్షుడు వీరేందర్, గౌడ సంఘం అధ్యక్షుడు బట్టు రవి, నాయకులు అంబటి వెంకన్న, వీరేశ్గౌడ్, విష్ణు, సత్యనారాయణ, అచ్చ య్య, శ్రీను, వెంకన్న, వెంకయ్య, అచ్చయ్య, కొమురయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.