పోచమ్మమైదాన్, మార్చి బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 11, 29 డివిజన్ల కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం మేయర్ గుండు సుధారాణితో కలిసి వరంగల్ రామన్నపేటలోని మణిదీప్ గార్డెన్లో గురువారం జరిగింది. చీఫ్ విప్ మాట్లాడుతూ కొత్త, పాత నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో ప్రచారం చేయాలని, లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని సూచించారు.
ప్రభుత్వం డివిజన్ పరిధిలో రూ.47కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, డివిజన్లో రూ.61కోట్లతో కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. కాగా 20మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అజీజ్ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, 29వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్, పార్టీ 11 డివిజన్ అధ్యక్షుడు కందుల సృజన్కుమార్ పాల్గొన్నారు.
ప్రాణాలను కాపాడింది
సీఎం రిలీఫ్ ఫండ్ నా ప్రాణాలను కాపాడింది. గుండె జబ్బు కారణంగా బతకడం కష్టంగా ఉండేది. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న. రూ.2లక్షల 50వేల ఎల్వోసీ ఇచ్చిన్రు. హార్ట్ సర్జరీ చేసుకుని ఆనందంగా బతుకుతున్నాను. సీఎం సార్ కడుపు సల్లగుండాలె.
– పోతననగర్, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారు
హాయిగా బతుకుతున్నా..
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన దళితబంధుతో హాయిగా బతుకుతున్నా. డబ్బులతో కారు కొని కిరాయికి నడుపుతున్నా. రూ.2వేలు వస్తున్నాయి. ఈ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ చిట్టీలు కడుతున్నా. కారు కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నా.
– జన్ను విద్య, రంగంపేట