హనుమకొండ, ఫిబ్రవరి 27: రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్)లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్లోని మహబూబాబాద్, వరంగల్ జిల్లాల అటవీ శాఖ అధికారులు బదిలీ అయ్యారు. మహబూబాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి డాక్టర్ బీ ప్రభాకర్ (ఐఎఫ్ఎస్)ను మీసేవ కమిషనర్గా, వరంగల్ జిల్లా అటవీ శాఖాధికారి అపర్ణ (ఐఎఫ్ఎస్)ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హైదరాబాద్ హెడ్ ఆఫీస్కు డీసీఎఫ్గా బదిలీ చేశారు.
అలాగే వెయిటింగ్లో ఉన్న డాక్టర్ బి.ప్రభాకర్ (ఐఎఫ్ఎస్)ను కాళేశ్వరం సర్కిల్లో ఎగ్జిస్టింగ్ వేకెన్సీ భూపాలపల్లికి పోస్టింగ్ ఇచ్చారు. ఏటూరునాగారం ఎఫ్డీవో అంజూ అగర్వాల్ (ఐఎఫ్ఎస్)ను వరంగల్ జిల్లా అటవీ శాఖాధికారిగా, అమ్రాబాద్ ఎఫ్డీవో విశాల్ బత్తుల (ఐఎఫ్ఎస్)ను మహబూబాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారిగా బదిలీ చేశారు.