చిల్పూరు, మార్చి 22: బుగులు వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం శుక్రవారం కన్నులపండువగా జరిగింది. పట్టువస్ర్తాలు స్వర్ణ, వజ్ర వైడూర్య, ముత్యాల ఆభరణాలతో అలంకృతుడైన స్వామి వారు గజవాహనంపై మండపానికి ఊరేగింపుగా వచ్చారు. భక్తజన కోటికి సకల సంపదలను ప్రసాదించే మహాలక్ష్మి అమ్మవారిని పూల పల్లకిలో మంగళ వాయిద్యాలు, భజన బృందం, డప్పులు, బోనాలు, కోలాటాలతో కళాకారులు కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. కల్యాణ వేడుకలను పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం విశ్వక్సేనుడికి తొలి పూజలతో శ్రీకారం చుట్టారు. స్వామి, అమ్మవార్లకు రక్ష సూత్రధారణ చేసిన అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో స్వామి వారికి యజ్ఞోపవీతధారణ చేశారు. అనంతరం అర్చకులు వేద మంత్ర పఠనాలతో జీలకర్ర, బెల్లం తంతు నిర్వహించారు. ప్రభ్వుతం తరఫున ఇన్చార్జి ఈవో, దేవాదాయ శాఖ నల్లగొండ అసిస్టెంట్ కమిషనర్ మహేందర్ కుమార్ పట్టువస్ర్తాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు శుభ లగ్న సుముహూర్తంలో భక్తజనుల గోవింద నామస్మరణ, వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి మెడలో స్వామివారు మాంగల్యధారణ చేశారు.
కల్యా ణ మహోత్సవాన్ని బ్రాహ్మణపెల్లి రవీందర్శర్మ, సౌమిత్రీ రంగాచార్యులు, కృష్ణమాచార్యులు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మామిడాల యాదవరెడ్డి, ఆలయ శాశ్వత దాత, మాజీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, మంచగిరి ఆలయ ఈవో మోహన్, చిల్పూరు తహసీల్దార్ సరస్వతి, ఎస్సై ముత్యం రాజేందర్, చిల్పూరు మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తీగల మహేందర్, మండల పార్టీ అధ్యక్షుడు గడ్డమీది సురేశ్, పాలకమండలి సభ్యులు సంగోజు మోహనాచారి, పెద్ది నారాయణ, పుల్యాల నారాయణరెడ్డి, జక్కుల రాజశేఖర్, కనకం మధు, గాజుల రజిని, బీ బాలరాజు, పీ కిరణ్రెడ్డి, మేకల మల్లేశం, డీ ఎల్లయ్య, ఏ సత్యనారాయణ, బీ వికాస్రెడ్డి, ఉప్పరి గణేశ్, ఆలయ అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు, సిబ్బంది రమేశ్, వీరన్న, శేఖర్, విశాల్, కృష్ణ, మహేశ్, మాజీ సర్పంచ్లు మామిడాల లింగారెడ్డి, తాళ్లపెల్లి సమ్మయ్య, ఏదునూరి రవీందర్, మారబోయిన ఎల్లయ్య, పేరాల సుధాకర్ పాల్గొన్నారు.