‘పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తూ, రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే విజయం.. ప్రతి కార్యకర్త ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్తి గార్డెన్లో మానుకోట పట్టణ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి సత్యవతిరాథోడ్ పాల్గొనగా, శాసన మండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాశ్, ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్నాయక్, జడ్పీ చైర్పర్సన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. గత 75 ఏళ్లలో జరగని అభివృద్ధి తొమ్మిది సంవత్సరాల్లో జరిగిందని, పస్తుతం దేశప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని, ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్కు అండగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 20 : ‘పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే విజయం..’ అని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం పట్టణంలోని ఆర్తి గార్డెన్లో మానుకోట పట్టణ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి, శాసన మండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాశ్ పాల్గొనగా, ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యన్నతి కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. 75ఏళ్లలో జరగని అభివృద్ధి తొమ్మిది సంవత్సరాల్లో జరిగిందన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని, సీఎం కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. గిరిజన సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేశారని, ఆరుశాతం నుంచి 10శాతానికి రిజర్వేషన్ పెంచారన్నారు. ఒక్కో జీపీ భవన అభివృద్ధికి రూ. 20 లక్షలు మంజూరు చేశారని, జిల్లా పరిధిలోని గురుకుల పాఠశాలల అభివృద్ధి కోసం రూ. 5కోట్ల నిధులు అందించారని గుర్తు చేశారు. మారుమూల తండాల్లోని సీసీ రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయని, తండాలను జీపీలుగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపించడం లేదన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశ ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని, రాష్ర్టాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్పై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేయాలన్నారు.
‘రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే పార్టీకి శ్రీరామరక్ష. వాటి వల్లే బీఆర్ఎస్ మళ్లీ విజయం సాధిస్తుంది’ అని శాసన మండలి ఉపాధ్యక్షుడు బండా ప్రకాశ్ అన్నారు. బీజేపీ నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ప్రజలమధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ చేస్తున్న ప్రగతిని ప్రజలు కళ్లారా చూస్తున్నారని, కాంగ్రెస్, బీజేపీ నాయకులకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. స్వరాష్ట్రంలోనే మన నీళ్లు, మన నిధుల వల్ల అభివృద్ధి జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే అన్ని కులాల వారికి లబ్ధి జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు. ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, ఒక పట్టుదలతో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ అంగోతు బిందు పిలుపునిచ్చారు. సమైక్య రాష్టంలో అనేక ఇబ్బందులు పడ్డామని, స్వరాష్ట్రంలో సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు.
గతంలో తండాలో నీటి సమస్యలు తీవ్రంగా ఉండేవని, కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి పుష్కలంగా నీరు అందుతున్నదని పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గ ఇన్చార్జి పురాణం సతీశ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మార్నే ని వెంకన్న మాట్లాడారు. దేశంలో బీజేపీ మత విద్వేషాలు సృష్టిస్తున్నదని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందన్నారు. దళిత బంధు పథకం ఇతర రాష్టాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి జరుగుతున్నదని, నేడు అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీకి అండగా ఉండాలని, బీఆర్ఎస్ విజయానికి సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, పర్కాల శ్రీనివాసరెడ్డి, కేసన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాల రూపు రేఖలు మారాయని ఎమ్మెల్యే శంకర్నాయక్ అన్నారు. గత పాలకులు పేదలను ఓటు బ్యాంకుగా వాడుకొని వారి సమస్యలను పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జిల్లా ఏర్పడి అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. జిల్లాకు ముఖ్యమంత్రి మెడికల్, నర్సింగ్ కళాశాలను మంజూరు చేశారని, దీంతో అడ్మిషన్లు సై తం ప్రారంభమైనట్లు తెలిపారు. మానుకోట రూపురేఖలు మార్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరేవిధంగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు.
బంగారు తెలంగాణ నిర్మాణంతో ప్రపంచ స్థాయి నగరాలతో రాష్ట్రం పోటీ పడుతున్నదని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తు ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపారని వివరించారు. తెలంగాణపై వివక్ష చూపిన కేంద్రం నిధులు సక్రమంగా ఇవ్వకపోయినా ఇతర రాష్ర్టాలతో పోటీ పడి 13 అవార్డులు పొందడం సంతోషంగా ఉందన్నారు. మానుకోటకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మంచి గుర్తింపు వచ్చిందని, జిల్లా ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, ప్రతి కార్యకర్త బాధ్యతగా వాటిని తిప్పికొట్టాలన్నారు. కేసీఆర్ దేశం కోసం ప్రయాణాన్ని ప్రారంభించారని, ఈ సమయంలో అందరం అండగా ఉండాలన్నారు.