హనుమకొండ, ఏప్రిల్ 28 : రోడ్షో అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం రాత్రి హనుమకొండ హంటర్రోడ్డులోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసానికి చేరుకున్నారు. అక్కడే ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలలో పార్లమెంట్ ఎన్నికల వ్యూహం, తదితర అంశాలపై చర్చించనున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం ఖమ్మం బయలుదేరి అక్కడ నిర్వహించే రోడ్షోలో పాల్గొననున్నారు.