హనుమకొండ చౌరస్తా, జూన్ 28: పంటల అభివృద్ధికి బయోటెక్నాలజీ పరిష్కారమని, మొకల్లో లవణీయత తగ్గించటం ద్వారా ఉత్పత్తి పెరుగుతుందని, ఆ దిశగా మరిన్ని పరిశోధనలు జరగాలని సింగపూర్కు చెందిన నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రకాశ్ పీ కుమార్ అన్నారు. బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘జినోమ్ ఎడిటింగ్ అండ్ ప్లాంట్ బయో టెక్నాలజీ’ మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో భాగంగా బుధవారం రెండోరోజు మూడు ప్లీనరీ సెషన్లు జరిగాయి. రక్తపోటు నియంత్రణకు టమాటాలు ఎంతో ఉపయోగకరమని ఆస్ట్రేలియా ముద్రాక్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంజీకే జోన్స్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం సెనెట్హాల్లో మొదటి సెషన్లో పూణే సావిత్రీబాయి ఫూలే యూనివర్సిటీ ప్రొఫెసర్ శీర్షమిత్ర తన ప్రసంగంలో టమాటా మొకలు వివిధ రకాలుగా తట్టుకునేలా ప్రయోగాలను వివరించారు.
ఆస్ట్రేలియా ముద్రాక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంజీకే జోన్స్ తన ప్రసంగంలో వాణిజ్యపరంగా క్రాప్ బ్రీడింగ్ ఉపయోగపడుతుందని, మారకుండా ఉండే ఆలుగడ్డ, బూజు తెగులు తట్టుకునేలా గోధుమలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రసం పీల్చే పురుగుల ద్వారా రక్షించే పత్తి, వరి పంట గురించి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కేవీ రావు వివరించారు. రెండో ప్లీనరీ సెషన్లో భారతియర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సతీశ్కుమార్ తన ప్రసంగంలో పోషకాహార లోపాన్ని నియంత్రించడానికి, పంటల్లో పోషకాలతో ఎలా అభివృద్ధి చేయాలో వివరించారు. మలేషియా మలయా యూనివర్సిటీ ఆచార్యులు జెన్నిఫర్ అన్ హరికృష్ణ తన ప్రసంగంలో ఇతర ఒత్తిడిలను తట్టుకునే నిలబడే అరటి మొకలను గురించి వివరించారు. బెంగళూర్ శాస్త్రవేత్త డాక్టర్ పీవీ శివప్రసాద్ తన ప్రసంగంలో మొకల రూపాంతరానికి కారణం, రూపాంతరం ద్వారా ఆహార ఉత్పత్తి పెంచేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. ప్రొఫెసర్లు రోజారాణి, ఎంవీ రాజం, ప్రశాంత మిశ్రా, కోటా శ్రీనివాస్, కేవీ సరిత, విశ్రాంత ప్రొఫెసర్ చేరాలు, డాక్టర్ మాధురి, ఇతర శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులతోపాటు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఎస్.రాంరెడ్డి, కృష్ణారెడ్డి, క్రిస్టోఫర్, ఎ.సదానందం, ఎన్.రామస్వామి, వీఎస్ రాజు, వీ కిషన్, డాక్టర్ పీ వెంకటయ్య, ముస్తఫా, డాక్టర్ లలితకుమారి, జి.అచ్చయ్య, డాక్టర్ ఏవీ రావు, డాక్టర్ టీ శాస్త్రి, విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.