హనుమకొండ చౌరస్తా, మార్చి 2 : హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో భీమా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మూవీ హీరో గోపీచంద్, చిత్రబృందం సందడి చేసింది. సభా ప్రాంగణానికి హీరో గోపిచంద్ రాగానే అభిమానుల కేరింతలతో మైదానం మార్మోగింది. గోపీచంద్తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు.