వరంగల్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): వరంగల్లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన పాలక మండలి సభ్యులను నియమించింది. ఈమేరకు ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. ఈ పాలకమండలిలో ఏడుగురు సభ్యులు కాళోజీ యూనివర్సిటీ పరిపాలన పరమైన విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. వీరి పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది.
పాలక మండలిలో మెడిసిన్ నుంచి నిమ్స్లోని రుమటాలజీ అండ్ డీన్, హెచ్వోడీ డాక్టర్ లీజా రాజశేఖర్, హైదరాబాద్లోని సన్షైన్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ డాక్టర్ గురువారెడ్డి, సికింద్రాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, అల్లోపతిక్ నుంచి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, యూనివర్సిటీ సంబంధిత కళాశాల నుంచి ఉస్మానియా మెడికల్ కళాశాల పీడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.రవికుమార్, ఉస్మానియా మెడికల్ కళాశాల, నీలోఫర్ హాస్పిటల్ ఇన్చార్జి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషారాణి, మహబూబాబాద్ మెడికల్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్, డాక్టర్ జె.వెంకటేశ్వర్రావు ఉన్నారు.