ఖిలావరంగల్, ఫిబ్రవరి 3 : ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు జరుగనున్న అన్నారం దర్గా ఉర్సు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు ఏర్పా టు చేయాలని సూచించారు. మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవ కార్యక్రమాలు, వైద్య ఆరోగ్య శాఖ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పారిశుధ్యం పక్కాగా నిర్వహించాలని, విద్యుత్, అ గ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో మహేందర్జీ, డీఎంహెచ్వో వెంకటరమణ, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
సన్నూరు దేవస్థానం అభివృద్ధిపై సమీక్ష
రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై కలెక్టర్ బీ గోపి సమీక్ష నిర్వహించారు. దేవస్థానం మ్యాప్ను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు, పాలక మండలి సభ్యులతో కలెక్టర్ చర్చించారు. మ్యాప్తో పాటు అంచనా వ్యయాన్ని కలెక్టర్ సమక్షంలో కమిటీ సభ్యులు, దేవాదాయశాఖ అధికారులు ఆమోదించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత, డీఈ రమేశ్బాబు, ఈవో సుదర్శన్, కమిటీ సభ్యుడు రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.