దుగ్గొండి, మార్చి 2 : ఈ నెల 7వ తేదీ నుంచి జరుగనున్న కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరకు రాజకీయ ప్రభ బండ్లను పూర్తిగా నిషేధించినట్లు నర్సంపేట ఏసీపీ సంపత్రావు తెలిపారు. గిర్నిబావిలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ శాఖ ఆదేశాలను బేఖాతర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు.
విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున జాతరకు ప్రభలు, డీజేలు ఏర్పాటు చేసుకొని రావొద్దని కోరారు. గొడవలకు తావులేకుండా జాతర విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సమావేశంలో దుగ్గొండి రూరల్ సీఐ సూర్యప్రసాద్, ఎస్సై వంగల నవీన్కుమార్, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.