పోచమ్మమైదాన్, జనవరి 1 : వరంగల్ నగరంలో సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం 6గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము 3గంటల వరకు పెట్రోలింగ్, వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
ఇందులో 180 మంది వరకు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారని, వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరుగకపోవడం సంతోషంగా ఉందని ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు పేర్కొన్నారు. పెట్రోలింగ్లో సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది కష్టపడి పనిచేశారని అభినందించారు.