సుబేదారి, సెప్టెంబర్ 24 : తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర కాలంలోనే బ్యాంకు ను లాభాల్లోకి తీసుకొచ్చామని ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. డీసీసీబీ మహాజన సభ(జనరల్బాడీ) గురువారం హన్మకొండ అంబేద్కర్భవనంలో నిర్వహించారు. ముందుగా బ్యాంకు సీఈవో ఎజెం డా అంశాలను సభ్యులకు చదివి వినిపించారు. అనంతరం బ్యాంకు చైర్మన్ రవీందర్రావు మాట్లాడుతూ.. ఏడాదిన్నర కాలంలోనే బ్యాంకు టర్నోవర్ రూ.800 కోట్ల నుంచి రూ.1300కోట్లకు తీసుకొచ్చామని, వచ్చే మార్చినెల వరకు 1500కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పాలకవర్గ సభ్యులు, పీఏసీఎస్ చైర్మన్లు, అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో గణనీయమైన పురోగతి సాధించినట్లు చెప్పారు. రూ. 6.13 కోట్ల లాభాలు వచ్చాయన్నారు. 44 సంఘా లు ఏ గ్రేడ్లో ఉన్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కమర్షియల్ బ్యాంకులకు దీటుగా ముందుకువెళ్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో రైతులకు పంట రుణాలు, వ్యవసాయ భూముల మార్ట్గేజ్ లోన్లు, ఎల్టీ లోన్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. 6 జిల్లాలో 19 పాత బ్రాంచ్లు, కొత్తగా మరో 8 బ్రాంచ్లతో కలిపి 27 బ్రాంచ్ల నుంచి 70 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్న రైతులకు అవసరం మేరకు రుణాలు ఇస్తూ బ్యాంకును లాభాల బాట పట్టిస్తున్నట్లు తెలిపారు.
దీంతోపాటు కమర్షియల్, హౌసింగ్ లోన్లు, రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం రూ.30లక్షల వరకు, చిరువ్యాపారులకు రూ.లక్ష నుంచి రూ.2లక్షలు, చేనేత సంఘాలు, ఎస్సీ, ఎస్టీలకు, మహిళా సంఘాలకు ఈ వార్షిక సంవత్సరంలో రూ.789 కోట్ల రుణాలు ఇచ్చినట్లు చైర్మన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, నాబార్డు సహకారంతో బ్యాంకు అభివృద్ధికి పారదర్శకంగా పనిచేస్తున్నామన్నారు. 30ఏళ్ల క్రితం వీవర్స్ సంఘాలు తీసుకున్న రూ.9కోట్ల రుణాలు పెండింగ్లో ఉన్నాయని, వీటితో బ్యాంకు ఎన్పీఏ ప్రమాదంలో ఉన్నందున రూ.5కోట్లు రైటాఫ్ చేసి ఆ సంఘాల సభ్వత్వాన్ని రద్దు చేసినట్లు చైర్మన్ తెలిపారు. తమ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసిన ఖాతాదారులకు ఏ బ్యాంకులో లేనివిధంగా 7.25 శాతం వడ్డీ ఇస్తున్నామన్నారు. ఆయిల్పాం సాగు చేసే రైతులకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించామని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందుకోసం బ్యాంకు పాలకమండలి సభ్యులు, పీఏసీఎస్ చైర్మన్లు, అధికారులు త్వరలోనే ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలోని ఆయిల్పాం పంటలను సందర్శించడానికి స్టడీటూర్గా వెళ్తున్నట్లు తెలిపారు.