హనుమకొండ సిటీ, ఆగస్టు 17 : ఉద్యోగులకు దళిత బంధు పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని టీఎన్జీవోస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట టీఎన్జీవోస్ బాధ్యులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత ఉద్యోగులకు సైతం దళిత బంధు ఇస్తామని సీఎం ప్రకటించారని, దళితులపై ఆయనకున్న అభిమానం ఎలాంటిదో తెలిసిపోతుందన్నారు. ఈ పథకం దేశంలోనే చరిత్ర సృష్టించి, దళిత కుటుంబాల్లో వెలుగు నింపుతుందన్నారు. కార్యదర్శి సోమయ్య మాట్లాడుతూ దళిత బంధు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు సైతం ఈ పథకం వర్తిస్తుందని సీఎం పేర్కొనడం ఆయన దార్శనికతకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోశాధికారి రాజేశ్, కేంద్ర సంఘం నాయకులు శ్యాంసుందర్, కత్తి రమేశ్, షఫీ, జిల్లా నాయకులు సలీం, చీకటి శ్రీనివాస్, సురేశ్, ఉదయ్భాస్కర్, లక్ష్మీప్రసాద్, వర్ష, యుమున, సరస్వతి, రాజేశ్ఖన్నా, రమాదేవి, రాజ్యలక్ష్మి, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.
అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్
అభినవ అంబేద్కర్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అని టీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ అన్నారు. దళిత బంధు పథకం అమలును హర్షిస్తూ కేయూలో మంగళవారం టీఆర్ఎస్వీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ 10 లక్షల రూపాయలతో దళితులు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతారనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ ఇన్చార్జి జెట్టి రాజేందర్, కలకోట్ల సుమన్, గొల్లపల్లి వీరస్వామి, పిన్నింటి విజయ్, వినోద్, అనిల్, రాంబాబు పాల్గొన్నారు.