వరంగల్ అర్బన్ : కాకతీయ యూనివర్సిటీ భద్రతా సిబ్బంది వరంగల్ వాసవీ క్లబ్ మాస్కులు, శానిటైజర్లు అందజేసింది. సిబ్బందికి 45 రోజులకు సరిపడే విధంగా రూ. 20 వేల విలువైన వస్తువులను విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ కె.పురుషోత్తం మాట్లాడుతూ.. కొవిడ్ మహమ్మారి తిరిగి విజృంభిస్తున్నందున మాస్కులు ధరించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి కొవిడ్-19 నిబందనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. వర్సిటీలో పనిచేస్తున్న భద్రతా సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు విరాళంగా ఇచ్చిన వాసవి క్లబ్ ఆఫ్ వరంగల్ అధ్యక్షుడు పల్లాల పృథ్వీరాజ్ను రిజిస్ట్రార్ ప్రశంసించారు.