పల్లె ప్రగతి ప్రపంచానికే ఆదర్శం
కేసీఆర్ పథకాలు దేశానికే దిక్సూచి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ఆత్మకూరు, శాయంపేట, రేగొండ, కాటారం మండలాల్లో పర్యటన
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
ఆత్మకూరు/శాయంపేట/రేగొండ/కాటారం, జూలై 5 : సమష్టి కృషితోనే గ్రామాలు సమగ్రాభివృద్ధిని సాధిస్తాయని, పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలోనే అద్భుత ప్రగతి సాధించామని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయన్నారు. సోమవారం ఆయన వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనతోపాటు ప్రారంభోత్సవాలు చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటారు. మొదట ఆయన వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని హౌసుబుజుర్గు నుంచి ప్రగతిసింగారం వరకు రూ.3.21 కోట్లతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శాయంపేట మండలంలోని మాందారిపేట నుంచి శాయంపేట మీదుగా ప్రగతిసింగారం వరకు రూ.6.09కోట్లతో డబుల్రోడ్డు పనులకు శంకుస్థాపన, రైతువేదికను ప్రారంభించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని చెన్నాపూర్ నుంచి రాజక్కపల్లె వరకు రూ.5.13కోట్లతో, రేపాక నుంచి కనిపర్తివరకు రూ. 4.98కో ట్లు డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కాటారం మండలకేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్లో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణీరాకేశ్ సహకారంతో ‘మీ సేవకు మా సత్కారం’ కార్యక్రమంలో ఫ్రంట్లైన్ వారియర్లు పోలీస్, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులను సన్మానించారు. సబ్స్టేషన్ పల్లిలో రూ.15లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, కాటారం మార్కెట్ కమిటీ కార్యాలయ భవనం, కవర్షెడ్, 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ రూరల్, జయశంకర్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.
వచ్చేనెల నుంచి 57 ఏళ్లు దాటిన వారందరికీ పింఛన్లు ఇస్తామని సీఎం ప్రకటించినట్లు తెలిపారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం దళిత క్రాంతి పథకానికి రూపకల్పన చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడుతున్నాయన్నారు. కొవిడ్ సమయంలో రైతుబంధు పథకానికి రూ.10వేల కోట్లు విడుదల చేసి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను మెచ్చుకుంటూనే సాయం అందించడంలో మొండిచేయి చూపిస్తున్నదని ఆరోపించారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా సేవలందించిన గ్రామ పంచాయతీ సిబ్బందిని గుర్తించి వారి త్యాగాలను సమాజానికి చాటి చెప్పాలన్న ఆలోచనతో పెద్దపల్లి జడ్పీచైర్మన్ పుట్ట మధు ఆధ్వర్యంలో చేపట్టిన ‘మీ సేవకు మా సత్కారం’ భేషు గ్గా ఉందని మంత్రి అన్నారు. శాయంపేట మం డల అభివృద్ధికి ఎమ్మెల్యే గండ్ర, జడ్పీ చైర్పర్సన్ జ్యోతి కోరిన విధంగా ఎక్కువ నిధులు ఇస్తానని అన్నారు.
పత్తిపాకలో కరంటు లూజ్ పోల్స్ ఉన్నాయని, ఇండ్లపై కరంటు తీగలు తగులుతున్నాయని విద్యుత్ శాఖ అధికారులు పది రోజుల్లో క్లియర్ చేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో చెత్తను తొలగింపునకు నోటీసులు ఇవ్వాలని, స్పందించకపోతే రూ.3వేలు జరిమానా విధించాలన్నారు. శాయంపేట నూతన జీపీ భవనానికి నిధులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆత్మకూరు, శాయంపేటలో జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్, ఆర్డీవో మహేందర్జీ, డీఆర్డీఏ పీడీ సంపత్రావు, మిషన్ భగీరథ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వెంకన్న, డైరెక్టర్ బుచ్చిరెడ్డి, ఎంపీపీ సుమలత, జడ్పీటీసీ రాధిక, గూడెప్పాడ్ మార్కెట్ చైర్మన్ కేశవరెడ్డి, డీపీవో ప్రభాకర్, జడ్పీ సీఈవో రాజారావు, డీఎల్పీవో కల్పన, సర్పంచ్లు ఎస్కే రబీయాబీ హుస్సేన్, రవి, రాజిరెడ్డి, సుమలత, మౌనిక, ఎంపీటీసీ శ్రీనివాస్, స్వాతి, ఆర్బీఎస్ అధ్యక్షుడు ఆదిరెడ్డి, ఎంపీపీ తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మనోహర్రెడ్డి, రేగొండ, కాటారంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య, అదనపు కలెక్టర్ షేక్రిజ్వాన్పాషా, డీపీవో ఆశలత, సీఈవో శోభారాణి, డీఆర్డీవో పురుషోత్తం, జడ్పీవైస్ చైర్మన్ శోభ, జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, జడ్పీటీసీ విజయ, ఎంపీపీ పున్నంలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్రావు, సర్పంచ్లు ప్రణీతచ తిరుపతి, నీల, సుధాకర్, శ్రీనివాసరావు, రంజిత్, ఎంపీటీసీలు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోడెం ఉమేశ్గౌడ్, టీఆర్ఎస్ జిల్లా నేత జక్కు రాకేశ్, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ అన్కారి భవానీప్రకాష్, సర్పంచ్ తోట రాధమ్మ, పీఏసీఎస్ చైర్మన్లు నారాయణరెడ్డి, శాంతకుమార్, తిరుపతి, రామారావు, మహాదేవపూర్ ఎంపీపీ బన్సోడా రాణీబాయి, ఎంపీటీసీలు టీఆర్ఎస్ మండలాధ్యక్షులు డోలి అర్జయ్య, రాముగౌడ్, యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.