న్యూఢిల్లీ, జూలై 4: కొవిషీల్డ్ రెండు డోసులు వేసుకున్న 16 శాతం మంది నమూనాల్లో డెల్టా వేరియంట్ను ఎదుర్కొనే యాంటిబాడీలు (ప్రతిరక్షకాలు) ఏర్పడలేదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ‘కొవిషీల్డ్’ టీకా ఒక డోసు వేసుకున్న 58.1 శాతం మంది నమూనాల్లో డెల్టా వేరియంట్కు వ్యతిరేకంగా యాంటిబాడీలు వృద్ధి చెందలేదని తేలింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్) పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు ఇంకా సమీక్షించాల్సి ఉన్నది. దేశంలో డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో బూస్టర్ డోస్ (మూడో డోస్) అవసరపడొచ్చని క్రిస్టియానా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ జాకోబ్ జాన్ అభిప్రాయపడ్డారు.