న్యూఢిల్లీ, జూన్ 8: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల సంస్థ మెర్సిడెజ్-బెంజ్.. దేశీయ మార్కెట్లోకి అల్ట్రా-లగ్జరీ ఎస్యూవీ మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీఎల్ఎస్ 600 4 మెటిక్ పేరుతో పిలువబడే ఈ కారు ప్రారంభ ధర రూ.2.43 కోట్లుగా నిర్ణయించింది. సంస్థ విడుదల చేసిన అల్ట్రా లగ్జరీ కారు ఇదే కావడం గమనార్హం. కేవలం 4.9 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. వీ8 3,982 సీసీ పెట్రోల్ ఇంజిన్తో ఈ కారును తీర్చిదిద్దింది సంస్థ.