న్యూఢిల్లీ: వాహనంలోని ముందు సీటులో (డ్రైవర్ పక్కన సీటు) ఎయిర్ బ్యాగ్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రహదారి భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి తయారయ్యే వాహనాలు తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాలన్నది. వినియోగంలో ఉన్న వాహనాల్లో ఆగస్టు 31 నాటికి ఎయిర్ బ్యాగ్లను అమర్చుకోవాలని ఆదేశించింది.