కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోగల కురుంబాచి కొండ చీలికలో ఓ ట్రెక్కర్ చిక్కుకుపోయి రెండురోజులు నరకయాతన అనుభవించాడు.. కేరళకు చెందిన బాబు (23) అనే యువకుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కొండ ఎక్కేందుకు యత్నించారు. ఇద్దరు స్నేహితులు మధ్యలోనే తమ ప్రయత్నాన్ని విరమించుకోగా.. బాబు ఒక్కడే కొండ శిఖరం వరకు చేరుకోగలిగాడు. కానీ, జారిపడడంతో కొండమధ్యలో ఉన్న ఓ చీలిక వద్ద చిక్కుకుపోయాడు. అతడిని కాపాడేందుకు స్నేహితులు విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సహాయక బృందాలు అక్కడికి చేరుకుని అతడిని రక్షించే ప్రయత్నం చేశాయి. అయితే, ఆ బృందాలు అక్కడివరకూ వెళ్లలేకపోయాయి. విషయం తెలుసుకున్న సీఎం పినరయి విజయన్ ఆర్మీ సాయం కోరారు. ఆర్మీ రంగంలోకి దిగి ఎంతో సాహసం చేసి బాబును కాపాడింది. బాబును కాపాడేందుకు ఇండియన్ ఆర్మీ చేసిన సహాయం ఈ వీడియోలో చూడొచ్చు.