కడుపులో ఉన్న బిడ్డ ఆడా.. మగా.. అనే విషయం.. డెలివరీ అయ్యేదాక తెలియదు. గర్భిణీలను టెస్ట్ చేసే డాక్టర్లకు ఆ విషయం తెలిసినా చెప్పరు. ఒకవేళ.. డాక్టర్లు కడుపులో ఉన్న బిడ్డ లింగాన్ని చెప్పినా.. లేక.. తల్లిదండ్రులు.. జెండర్ టెస్ట్ చేయించి ముందే తెలుసుకున్నా.. అది నేరం. దానికి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. కడుపులో పెరిగే బిడ్డ.. ఆడ అని తెలుసుకొని.. చాలామంది పురిట్లోనో లేక పుట్టకముందు అబార్షన్ చేయించడం లాంటి ఘటనలను మనం ఎన్నో చూశాం. అందుకే.. ఎక్కడ కూడా జెండర్ టెస్ట్ చేయరు. డాక్టర్లు కూడా ఈ విషయంపై నోరు విప్పరు.
కానీ.. ఈజిప్ట్కు చెందిన ఓ యూట్యూబర్ మాత్రం తొందరపడి.. ఆవేశపడి.. అడ్డంగా బుక్కయ్యాడు. అది కూడా గీజా పిరమిడ్ దగ్గర జెండర్ రివీల్ పార్టీ చేసుకొని ఇప్పుడు ఊచలు లెక్కపెట్టేందుకు సిద్ధం అవుతున్నాడు.
యూట్యూబర్ సియామండ్ ముస్తఫా భార్య షాహద్.. త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఇప్పుడు గర్భిణి. ముందు వాళ్లకు ఒక పాప ఉంది. అయితే.. తమ ఫ్రెండ్స్తో గీజా పిరమిడ్ దగ్గరకు వెళ్లి.. అక్కడ అంత లైటింగ్ డెకరేషన్ చేయించి.. పిరమిడ్స్ బ్లూ కలర్లోకి మారగానే.. తమకు కొడుకు పుడుతాడని వాళ్లు చెబుతున్నారు. దాన్ని వీడియో షూట్ చేసి.. తన యూట్యూబ్ చానెల్లో ముస్తఫా పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు.. చివరకు పిరమిడ్ అధికారుల వరకు వెళ్లింది.
అయితే.. అధికారుల వర్షన్ మాత్రం వేరే విధంగా ఉంది. కొన్ని రోజుల క్రితం పిరమిడ్స్ వద్ద లైట్స్ డెకరేట్ చేశారట.
అయితే.. అక్కడ లైట్స్ను డెకరేట్ చేసింది వరల్డ్ లివర్ డే సందర్భంగా. కానీ.. తానే అక్కడ లైట్స్ ఏర్పాటు చేయించానని చెప్పి ముస్తఫా చెప్పడంతో.. పిరమిడ్ అధికారులు.. ముస్తఫాపై కేసు ఫైల్ చేశారు. పిరమిడ్ లాంటి చారిత్రక కట్టడం వద్ద.. ఇలాంటి జెండర్ రివీల్ పార్టీలు ఏంటి? దాని వీడియోను మళ్లీ యూట్యూబ్లో పోస్ట్ చేయడం ఏంటి? అంటూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. జెండర్ రివీల్ పార్టీలు ఈమధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. గత సంవత్సరం కూడా ఇలాగే.. యూఏఈకి చెందిన ఓ జంట.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కట్టడం బుర్జ్ ఖలీఫా వద్ద జెండర్ రివీల్ పార్టీ చేసుకున్నారు.