Viral Video | తనకు రావాల్సిన బకాయి జీతాన్ని ఇవ్వాలని కోరినందుకు ఓ మాజీ ఉద్యోగిని షాపు యజమాని రాడ్తో కొట్టాడు. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనకు సంబంధించి అగర్తల పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సురజిత్ త్రిపుర అనే వ్యక్తి అగర్తలలోని ఓ బట్టల దుకాణంలో పనిచేసేవాడు. ఇటీవల అతను ఉద్యోగం మానేశాడు. అయితే, అక్టోబర్ నెలకు సంబంధించి తనకు రావాల్సిన బకాయి జీతాన్ని ఇవ్వాలంటూ షాపు యజమాని షాహాను సురజిత్ అడిగాడు. డబ్బులు అడిగాడన్న కోపంతో సురజిత్పై షాహా చేయి చేసుకున్నాడు. అతన్ని ధూషిస్తూ… ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అగర్తల పోలీసులు తెలిపారు. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఈ తంతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది.
Attention @Tripura_Police ! @YTFTIPRA have already taken up this matter with you ! We demand justice ! It breaks my heart to see treatment like this given to anyone ! Kindly Take action or I will personally come down to your station with my YTF warriors ! pic.twitter.com/ysOiiiSY5o
— Pradyot_Tripura (@PradyotManikya) November 8, 2022