భువనేశ్వర్: ఒడిశాకు చెందిన ప్రసిద్ధ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్, జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విలువైన సందేశాన్ని ఇచ్చారు. పూరీ బీచ్లో ఆదివారం అందమైన సాండ్ ఆర్ట్ను రూపొందించారు. అనంతరం ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కొన్ని శతాబ్దాలుగా మనం సొంత ఇల్లుగా పరిగణిస్తున్న మన ఏకైక భూమిని కాపాడుకునే దిశగా ప్రయత్నాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రభుత్వాలు, కార్పొరేషన్లు, ఇతర సంఘాలకు తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై భారత్లోని పూరీ బీచ్లో నా సందేశంతో కూడిన శాండ్ ఆర్ట్ అని సుదర్శన్ పట్నాయక్ ట్వీట్ చేశారు. ‘మనకు ఒక్కగానొక్క భూమి ఉంది. మన కోసమే కాకుండా మన భవిష్యత్ తరాల కోసం కూడా భూమాతను మనం జాగ్రత్తగా చూసుకోవాలి’ అని సూచించారు. ‘నేలను, పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అని హ్యాష్ ట్యాగ్లు పెట్టారు. ఈ ఇసుక కళా రూపంపై నెటిజన్లు అభినందనలు తెలిపారు.
కాగా, ఒడిశాకు చెందిన సుదర్శన్ పట్నాయక్ తన అరుదైన ఇసుక కళా రూపాలతో ఎన్నో పేరు ప్రఖ్యాతులు పొందారు. భారత్ తరుఫున 12కుపైగా అంతర్జాతీయ సాండ్ ఆర్ట్ చాంపియన్ ఫిప్లో పాల్గొన్నారు. 27కు పైగా మెడల్స్ను భారత్కు సాధించి పెట్టారు.
#WorldEnvironmentDay My SandArt at Puri beach in India with message “
We have #OnlyOneEarth & we need to take care of her not just for us but also for our future generations. “#SaveSoil #SaveSoilSaveEnvironment pic.twitter.com/SOkXopV7tB— Sudarsan Pattnaik (@sudarsansand) June 5, 2022