భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా, పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోనున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. వాళ్లు విడిపోవడానికి కారణం ఏంటి? అనేది ఇప్పటివరకూ తెలియలేదు. ఈ నేపథ్యంలో అయేషా ఒమర్ అనే పాకిస్థాన్ నటి, మోడల్తో షోయబ్ మాలిక్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఏడాది క్రితం షోయబ్, అయేషా ఒక ఫొటోషూట్లో కలిసి నటించారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే వార్తలు వినించాయి. షోయబ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…తనకు ఫొటోషూట్ సమయంలో అయేషా చాలా సాయపడిందని ఆమెని పొగడ్తల్లో ముంచెత్తాడు. ఇప్పుడు ఆ ఫొటోషూట్కి సంబంధించిన ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు చూసినవాళ్లంతా విడాకులకు మాలిక్ ప్రేమవ్యవహారమే కారణం అనుకుంటున్నారు. షోయబ్, సానియా విడాకుల కోసం ఇప్పటికే లాయర్లను సంప్రదించారు.
సానియా, షోయెబ్ మాలిక్ వివాహం 2010లో దుబాయ్లో ఘనంగా జరిగింది. వీళ్లకు ఇజాన్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, గత కొంత కాలంగా సానియా, షోయబ్ వేరువేరుగా ఉంటున్నారు. కలిసి ఉండడం ఇష్టంలేకపోవడంతో విడాకుల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దాంతో, వీళ్ల పన్నెండేళ్ల వివాహబంధం త్వరలోనే ముగియనుంది.