ముంబై : ఓ లోకల్ ట్రైన్ స్టేషన్లోకి వస్తుండగా రైల్వే ట్రాక్స్పై తిరుగుతున్న కుక్కను కాపాడి వేగంగా ప్లాట్ఫాం పైకి తీసుకువచ్చిన వ్యక్తి వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ముంబైలో ఈ ఘటనకు సంబంధించిన షార్ట్ క్లిప్ను ముంబై మేరి జాన్ అనే యూజర్ ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 1.87 లక్షల మంది వీక్షించారు. ముంబైలోని ఏ స్టేషన్లో ఈ వీడియో రికార్డు చేశారనే వివరాలు వెల్లడి కాలేదు.
లోకల్ ట్రైన్ స్టేషన్లోకి వస్తుండగా పెద్దసంఖ్యలో ప్రయాణీకులు వేచిఉన్నారు. ఈ సమయంలో రైలు పట్టాలపై వీధి కుక్క తిరగడం గమనించిన ఓ వ్యక్తి ట్రాక్స్పైకి దూకి కుక్కను పట్టుకుని ప్లాట్ఫాంపై వేచిఉన్న ప్రయాణీకులకు అందించాడు. ఆపై ఆ వ్యక్తిని ప్రయాణీకులు ప్లాట్ఫాం పైకి లాగడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇది ముంబై…ఈ వ్యక్తికి గౌరవం ఇవ్వండని పోస్ట్కు క్యాప్షన్గా ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.