ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే (ఐఐటీ బాంబే) దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటి. చాలా మంది విద్యార్థులు ఈ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ పొందాలని కలలు కంటారు. కాగా, ఐఐటీ విద్యార్థి జీవితానికి అద్దంపట్టే ఓ ఫొటోను.. ఐఐటీ, బాంబే ప్రొఫెసర్ అభిజిత్ మజుందార్ ట్విటర్లో షేర్చేశారు. ఓ పీహెచ్డీ స్కాలర్ నేలపై పడుకొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న ఫొటో వైరల్గా మారింది.
ఐఐటీ, బాంబే లైబ్రరీలో ఆదివారం కూడా ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులు కూర్చుని ఉంటారు. అందులో ఒక విద్యార్థి సీట్లో కూర్చోగా, మరో విద్యార్థి నేలపై పరుపేసుకొని పడుకొని ల్యాప్ట్యాప్ చూస్తుంటాడు. ఈ ఫొటోను షేర్ చేసిన ప్రొఫెసర్ అభిజిత్ మజుందార్ మంచి క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ‘రోహిత్జోషీ అనే పీహెచ్డీ స్కాలర్ ఆదివారం కూడా రూంకి వెళ్లడం లేదు. ల్యాబ్లోనే తన సీనియర్ పరుపుపై పడుకొని వర్క్ చేసుకుంటున్నాడు. ముంబైలో ఎండవేడి ఉంది.. ఏసీ కోసం ల్యాబ్లో ఇలా ఉండిపోతున్నారు.’ అని రాశాడు.
ఈ పోస్ట్కు చాలామంది కనెక్ట్ అయ్యారు. గత అనుభవాలను నెమరేసుకున్నారు. ఈ ఫొటోకు కామెంట్లు చేశారు. ‘నేను నా పీహెచ్డీ సమయంలో దీన్ని నిజంగా ఆనందించాను, వేసవిలో విద్యుత్ బిల్లుల నుంచి తప్పించుకున్నాను. మాకు అక్కడే టీవీ, సోఫా, స్లీపింగ్ చెయిర్, బ్యాగ్, డైనింగ్ టేబుల్ ఉండేవి.’ అని ఒక ట్విటర్ యూజర్ తన అనుభవాలను పంచుకున్నాడు.
A bechare PhD stdnt @RohitjoshiB working under a khoon-chooshing guide @abhijit_MLab not getting chance to go to room even in the Sunday night n hence sleeping in the lab on the mattress of his senior @Pankaj_27March . Mumbai Summer and Lab AC are just the excuses. PC @Shitalsy pic.twitter.com/ilEQH0LxiS
— Abhijit Majumder (@abhijit_MLab) April 17, 2022