ముంబై: ఒక ప్రసిద్ధ ఆలయంలోని శివలింగంపై మంచు పడింది. ఐస్ మాదిరిగా ఉన్న దీనిని చూసి ఆలయంలోని పూజారితోపాటు భక్తులు ఆశ్చర్యపోయారు. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ప్రముఖ త్రయంబకేశ్వర ఆలయంలో ఈ వింత జరిగింది. ఆలయంలోని శివలింగానికి పూజారి పూలతో అర్చన చేశారు. అయితే కొంత సేపటి తర్వాత శివలింగం పైభాగంలో తెల్లగా మంచు మాదిరిగా ఏర్పడింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆ పూజరి శివలింగంపైన ఉన్న పూలను తొలగించారు. ఐస్గడ్డ మాదిరిగా ఉన్న మంచును చేతితో తడిమి చూశారు.
కాగా, నరేంద్ర అహెర్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను శుక్రవారం పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జమ్ముకశ్మీర్లోని అమర్నాథ్ గుహలో అమరేశ్వర్ మహాదేవ్ రూపంలో ఏర్పడే మంచు శివలింగాన్ని వేలాది మంది భక్తులు ప్రతి ఏటా సందర్శిస్తుంటారు. కరోనా నేపథ్యంలో రెండేళ్ల విరామం తర్వాత పవిత్ర అమర్నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమైంది. ఈ తరుణంలో త్రయంబకేశ్వర ఆలయంలోని శివలింగంపై మంచుగడ్డ ఏర్పడటాన్ని అద్భుతమని, మహిమ అని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. అయితే మంచును కృతిమంగా రూపొందించి ఉంటారని కొందరు అనుమానం వ్యక్తం చేశారు.
त्र्यंबकेश्वर मंदिर ज्योतिर्लिंगातील महादेवाच्या स्वयंभू शिवलिंगात बर्फ गोठला हा एक नैसर्गिक चमत्कार आहे, तो कधीच घडला नाही अमरनाथ यात्रेला आजपासून सुरुवात झाली असून, त्र्यंबकराजमध्ये देवानेच भक्तांना दर्शन दिल्याची लोकांची श्रद्धा आहे. ❤️🙏 pic.twitter.com/XVFf6VXGuU
— Narendra Aher 🗨 (@aher_narendra) July 1, 2022